దేశీయ విపణిలో కెమెరాలకు డిమాండ్ ఏర్పడటంతో దిగ్గజ కెమెరా తయారీ కంపెనీ కానన్, వై-ఫై ఆధారిత కెమెరాలను ఇండియాలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చుస్తుంది. ఈ టెక్నాలజీ ఆధారితంగా పనిచేసే కెమెరాలు ఇప్పటికే జపాన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి కొన్ని వారాల్లో ఈ కెమెరాలు దేశీమ మార్కెట్లో లభ్యం కానున్నాయి. ఈ అధిక ముగింపు కెమెరాలో వై-ఫై టెక్నాలజీని నిక్షిప్తం చెయ్యటం వల్ల ఫోటోలను కంప్యూటర్స్, స్మార్ట్ఫోన్స్ అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలోకి సులువుగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆపిల్ కంప్యూటర్స్, ఐప్యాడ్స్ , ఐఫోన్లకు మరింత సౌకర్యవంతంగా సహకరించే విధంగా ప్రత్యేక అప్లికేషన్లను తమ తాజా ఎడిషిన్ కెమెరాలలో నిక్షిప్తం చేసినట్లు కానన్ ఇంక్ మేనేజింగ్ డైరక్టర్ Masaya Maeda తెలిపారు.













