న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు ( ELCOT) తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా 9 లక్షల ల్యాప్టాప్లను పంపిణి చేయునుంది. ఐదు సంవత్సరాల ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతగా రెండు లక్షల ల్యాపీలను హెచ్సిఎల్ సప్లయ్ చేయునంది. ఇందుకుగాను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు నుంచి హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్ 278 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ సంస్థకు ల్యాప్టాప్లను అందించే యోచనలో లెనోవో, ఏసర్లు ఉన్నట్లు తెలుస్తోంది.













