
ఐటీ దిగ్గజం విప్రో ఇన్పోటెక్, కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చే అల్ట్రాపోర్టబుల్ కంప్యూటింగ్ నోట్బుక్లను దేశీయ విఫణిలో లాంఛ్ చేసింది. ఏరో అల్ట్రాబుక్, ఏరో ఆల్పా, ఏరో బుక్ పేర్లతో వస్తున్న ఈ తేలికపాటి కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు 11.6 అంగుళాల డిస్ప్లే సైజు మొదలుకుని 14 అంగుళాల డిస్ప్లే వేరియంట్లలో రూపుదిద్దుకున్నాయి. ఏరో అల్ట్రాబుక్ మోడల్లో వస్తున్న 14 అంగుళాల నోట్బుక్ను భారతీయ ప్రప్రధమ అతి సన్నని నోట్బుక్గా విప్రో అభివర్ణించింది. ఈ డివైజ్ బరువు కేవలం 1.7కిలో గ్రాములు. ఇంటర్నల్ మెమెరీ సామర్ధ్యం 4జీబి, హార్డ్డిస్క్ పరిమాణ శక్తి 500జీబి.












