Just In
- 1 hr ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 8 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 9 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 12 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Movies అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సామ్సంగ్ సీఈఓ అరెస్టుకు రంగం సిద్దం
సామ్సంగ్ కంపెనీకి జే లీ మూడవ తరం అధినేతగా కొనసాగుతున్నారు.
సామ్సంగ్ కంపెనీ సీఈఓ జే లీ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జే లీ ని 22 గంటల పాటు విచారించిన ప్రత్యేకత విచారణ అధికారులు చివరకు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు స్ధానిక కోర్టును అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
Read More : ఈ బ్రాండెడ్ ఫోన్ల పై భారీగా ధర తగ్గించారు
చోయ్ సూన్ సిల్తో సంబంధాలన్న పలు సంస్థలకు సామ్ సంగ్ సీఈఓ 36.42 మిలియన్ డాలర్లను లంచగా ఇచ్చినట్లు కేసును విచారిస్తోన్న స్పెషల్ ప్రోసిక్యూటర్ ఆరోపిస్తోంది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలైన పార్క్ జీన్ హేకే చోయ్ సూన్ సిల్ సన్నిహితురాలు కావటంతో ఈ అవినీతి కుంభకోణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సామ్సంగ్ కంపెనీకి జే లీ మూడవ తరం అధినేతగా కొనసాగుతున్నారు.
టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు
సామ్సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.
ఎండుచేపల ఎగుమతితో ...
ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.
1938లో ...
సామ్సంగ్ను బయుంగ్ - చుల్ లీ అనే వ్యక్తి 1938లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ సంస్థ కొరియా నుంచి చైనాకు ఎండుచేపలు, కూరగాయలు ఇంకా పిండి పదార్థాలను ఓడల సాయంతో ఎగుమతి చేసేది.
సామ్సంగ్ చెయిన్ పరిశ్రమలు
తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్సంగ్ చెయిన్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్డాంగ్ బ్యాంగ్లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్సంగ్ లైఫ్ఇన్స్యూరెన్స్గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్సంగ్ అడుగుపెట్టంది.
1968, డిసెంబర్ 30..
1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్ అండ్ వైట్ టీవీని సామ్సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.
పెట్రో కెమికల్స్..
వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్సంగ్ అదేసంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.
కండెక్టర్ల తయారీ పై దృష్టి
1980లో సెమీ కండెక్టర్ల తయారీ పై దృష్టిసారించిన సామ్సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్లు, వీ.సీ.ఆర్లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.
మెురీ కార్డులతో పాటు హార్డ్డిస్క్లు
వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్సంగ్ 1990 మధ్య మెమెురీ కార్డులతో పాటు హార్డ్డిస్క్లను తయారు చేయడం ప్రారంభింది.
తొలి మొబైల్ ఫోన్
1995లో సామ్సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్లను ధ్వంసం చేయించారు.
మొబైల్ ఫోన్ల తయారీని సీరియస్గా
మొబైల్ ఫోన్ల తయారీని సీరియస్గా తీసుకన్న సామ్సంగ్ 1999లో ఇంటర్నెట్కు అనువైన ఫోన్లను తయారు చేసింది. ఓ వైపు మొబైల్ ఫోన్ మరోవైపు టెలివిజన్ల తయారీ పై దృష్టిపెట్టిన సామ్సంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది. 1999లో వీటి ఉత్పత్తి ప్రారభమైంది.
2000లో హైడెఫినిషన్ టీవీ..
2000వ సంవత్సరం హైడెఫినిషన్ టీవీని సామ్సంగ్ అందుబాటులోకి తెచ్చింది. 2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో సామ్సంగ్ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. పేరు ‘గెలాక్సీ ఎస్'. 2010లోనే 7 అంగుళాల గెలాక్సీ సిరీస్ ట్యాబ్లెట్ను సామ్సంగ్ విడుదల చేసింది. 2013లో ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ టీవీలతో పాటు డిస్ప్లేలను సామసంగ్ పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సామ్ సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లతో పాటు స్మార్ట్ టీవీలు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి..
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470