మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో త్వరలోనే దిగ్గజాలకు షాక్ ఇవ్వనుంది. ఈ కంపెనీ నుంచి త్వరలో అదిరిపోయే కెమెరాతో ఓ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో ఒప్పో ఈ ఫోన్ ని ప్రదర్శనకు ఉంచింది. 10x పేరుతో రానున్న ఈ మొబైల్ లో తొలిసారిగా 5x hybrid optical zoom systemని పొందుపరిచింది. కాగా ఇ్పటివరకు ఇటువంటి కెమెరా ఫీచర్ తో ఏ కంపెనీ ఫోన్ ని తీసుకురాలేదు. ఈ ఈవెంట్లో టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేదనిపై ఒప్పో వివరాలు ఇవ్వనప్పటికీ భారీ స్కెచ్ తోనే 2019ని ప్రారంభించబోతుందని ఈ ఫోన్ ద్వారా చాటి చెప్పింది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 10x డివైస్ hybrid optical zoom technologyతో రానుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ఏకంగా మూడు కెమెరాలను ఈ ఫోన్లో పొందుపరచనున్నారు.
ఈ మూడు కెమెరాలు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఓ కెమెరా ultrawide-angleతోనూ మరో కెమెరా ప్రైమరీగానూ మూడవ కెమెరా periscope style setupతో కూడిన telephoto actionతో రానుంది.
ఈ ఫోన్ మొత్తం 1ఎక్స్ నుంచి 10 ఎక్స్ వరకు అదిరిపోయే డిజైన్ తో రానుందని ఫోటోలను బట్టి తెలుస్తోంది. కాగా కంపెనీ ఇప్పటికే దీని ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. అయితే కమర్షియల్ గా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని మాత్రం చెప్పలేదు.
కాగా ఈ ఈవెంట్లో సరికొత్త ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ప్రదర్శనలో ఉంచింది. కేవలం మొబైల్ డిస్ ప్లే ద్వారానే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆపరేట్ చేయవచ్చు. రెండు విధాలైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ టెక్నాలజీలో భాగం కానున్నాయి.
కాగా ఈ టెక్నాలజీ ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ప్రదర్శనలో ఫోన్ కి సంబంధించిన వివరాలను మాత్రమే తెలిపారు. ఈ ఫీచర్లతో ఫోన్ రానుందని ఓ చిన్న వీడియో ద్వారా ప్రదక్శన చేశారు. షియోమి కూడా ఈ రకమైన టెక్నాలజీ మీద కసరత్తు చేస్తున్న సంగతి విదితమే.