చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి లేటెస్ట్ గా Redmi Note 7,Redmi Note 7 Pro ఫోన్లను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఫోన్ రెండో సారి ఫ్లాష్ సేల్ కి రానున్నట్టు షియోమి కంపెనీ ప్రకటించింది.కాగా మార్చ్ 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎమ్ఐ.కామ్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని షియోమి తెలిపింది.
ఈ Redmi Note 7,Redmi Note 7 Pro కొనుగోలు చేసిన వారికి జియో బంపర్ ఆఫర్ ఇస్తుంది.ఈ ఫోన్లు కొన్నవారికి అన్ని రీఛార్జిల పై డబుల్ బెనిఫిట్స్ అని అందిస్తుంది.దీంతోపాటు రూ.2,400 విలువగల క్యాష్ బ్యాక్ వోచర్లను అందిస్తుంది.
యాక్సిస్ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు తో Redmi Note 7లేదా Redmi Note 7 Proను కొనుగోలు చేసినవారికి 5% డిస్కౌంట్ లభిస్తుంది.అలాగా కొనుగోలుదారులు ఎయిర్టెల్ సబ్ స్క్రైబర్స్ అయితే ఎయిర్టెల్ డబుల్ డేటా ఆఫర్ పొందవచ్చు ,వీటిలో భాగంగా వారు 1,120GB యొక్క 4G డేటా ప్రయోజనం పొందవచ్చు.
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర రూ.9,999
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.11,999
ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.16,999
ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.