దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది మొబైల్ రంగంలో సరికొత్త స్టెప్ని తీసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది.ఈ నేపథ్యంలోనే ప్రపంచపు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ ఫోన్ ను Samsung Galaxy Fold పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. త్వరలో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి కూడా రాబోతుంది.ఏప్రిల్ 26నుంచి ఈ ఫోన్ యొక్క సేల్స్ మొదలు కానున్నాయి. దీని ధర సుమారు రూ.1.41లక్షలు గా ఉంది.
ఈ Samsung Galaxy Foldలో 7.3 ఇంచుల QXGA+ Dynamic AMOLED డిస్ప్లేను ఏర్పాటు చేసారు.ఫోన్ ను మడత పెట్టినప్పుడు 4.6-inch HD+ Super AMOLED డిస్ప్లే
ఈ ఫోన్లో మొత్తం 6 కెమెరాలను ఏర్పాటు చేసారు.ఫోన్ వెనుక భాగంలో 16MP+12MP+12MP ట్రిపుల్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 10MP కెమెరాను ఏర్పాటు చేసారు. అలాగే ముందు భాగంలో 10MP +8MP రెండు కెమెరాలను ఏర్పాటు చేసారు.
ర్యామ్ మరియు స్టోరేజ్ విషయానికొస్తే ఈ Samsung Galaxy Fold ఫోన్ 12జీబీ ర్యామ్ మరియు 512 జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉంటుంది.అయితే ఈ ఫోన్లో microSD కార్డు స్లాట్ ఉండదు.
Samsung Galaxy Fold 4,380 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్లో నిక్షిప్తం చేసిన 7nm 64-బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది.ఆండ్రాయిడ్ 9.0 'పై' పై ఫోన్ రన్ అవుతుంది.
7.3 ఇంచుల QXGA+ Dynamic AMOLED డిస్ప్లే,4.6-inch HD+ Super AMOLED డిస్ప్లే , 7nm 64-బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,16MP+12MP+12MP ట్రిపుల్ లెన్స్ కెమెరాలు, 10MP సెల్ఫీ కెమెరా,10MP +8MP డ్యూయల్ కెమెరా,12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై,4,380 ఎమ్ఏహెచ్ బ్యాటరీ