చైనా మొబైల్ కింగ్ మేకర్ షియోమి రెడ్ మి నోట్ సిరీస్లో మరో కొత్త డివైస్ను విడుదలచేసింది. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన ఒక ఈవెంట్లో రెడ్ మి నోట్ 7ను లాంచ్ చేసింది. అంతేకాదు డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్తో షియోమి తొలి స్మార్ట్ఫోన్గా రెడ్మి నోట్ 7 నిలవనుంది. చైనా ఇతర మొబైల్ మేకర్లు హువాయి, ఒప్పో, వన్ ప్లస్ లాంటి కంపెనీల కెమెరా ఫోన్లకు సవాల్ విసురుతూ 48 ఎంపి కెమెరా ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతోపాటు రెడ్మి నోట్ 7ప్రొను కూడా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో ఒక్క కెమెరా తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉన్నాయి.
Advertisement
Best Mobiles in India
Best Camera
Best Selling
Upcoming