ఇండియాలోని అతి పెద్ద సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని రోజులుగా వేర్వేరు సంస్థలతో డీల్స్ కుదుర్చుకుంటూ వార్తలలో నిలుస్తోంది. గత ఐదు వారాలలో కొన్ని సంస్థలతో వివిధ రకాల డీల్స్ చేసుకున్న జియో ఇప్పుడు కొత్తగా మరొక పెద్ద డీల్ కు శ్రీకారం చుట్టింది. అది కూడా అమెరికాకు చెందిన అతి పెద్ద పెట్టుబడి సంస్థ KKRతో డీల్ చేయడం మరొక పెద్ద న్యూస్.
ఆసియా ఖండంలో కెకెఆర్ మరొక సంస్థలో పెద్దమొత్తంలో పెట్టుబడులను పెట్టడం ఇదే మొదటిసారి. రిలయన్స్ జియోలో సుమారు 11,367 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా సంస్థ కెకెఆర్ అండ్ కో ప్రకటించింది. Reliance Jio: లాక్ డౌన్ లో జియోలో ఉపయోగకరమైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే...
రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డిజిటల్ యూనిట్లో 2.32 శాతం వాటాను ప్రముఖ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కెకెఆర్ రూ.11,367 కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తోంది. జియో గత నాలుగు వారాల్లో చేసిన ఐదవ ఒప్పందం ఇది. ఈ ఒప్పందంతో కలుపుకొని జియో మొత్తంగా ఆయిల్-టు-టెలికాం సమ్మేళనంలో రూ.78,562 కోట్ల రూపాయల ఒప్పందాలను చేసింది. WhatsApp వీడియో స్టేటస్ నుంచి మరో కొత్త అప్డేట్!!!
ఈ ఒప్పందాల తరువాత జియో ప్లాట్ఫామ్లలో ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు మరియు ఎంటర్ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లు. ఇది ఆసియాలో కెకెఆర్ యొక్క అతిపెద్ద పెట్టుబడి మరియు జియో ప్లాట్ఫామ్లలో 2.32 శాతం ఈక్విటీ వాటాగా అనువదిస్తుంది. అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంస్థలలో ఒకటైన కేకేఆర్ ఇండియాలో పెట్టుబడులు మా జియో సంస్థలో పెట్టడాన్ని స్వాగతిస్తున్నాము. ఈ ఒప్పందంతో ఇండియాలోని ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు దొరకడమే కాకుండా భారతీయ డిజిటల్ ఎకో సిస్టమ్ కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో విలువైన భాగస్వామి కేకేఆర్" అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ అన్నారు.
నాలుగో డీల్ లో భాగంగా ఇటీవల ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ జియో ప్లాట్ఫామ్స్లో రూ.6,598.38 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా జియో ప్లాట్ఫామ్స్లో 1.34 శాతం వాటాలు పొందింది.
అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ జియో ప్లాట్ఫామ్స్తో రూ.11,367 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా జియో ప్లాట్ఫామ్స్లో 2.32 శాతం వాటాలు పొందింది.
ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ జియో ప్లాట్ఫామ్స్లో రూ.5,655.75 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది రెండో డీల్. ఈ డీల్ ద్వారా సంస్థ జియో ప్లాట్ఫామ్స్లో 0.32 శాతం వాటాలు పొందింది.
రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులతో ఫేస్బుక్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్ఫామ్స్లో 9.99 శాతం వాటాతో ఫేస్బుక్ ఈ డీల్ కుదుర్చుకుంది .