చైనా మొబైల్ మేకర్ షియోమి సరికొత్త ఉత్పత్తులతో ఇండియాలో దూసుకువెళుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ ని టచ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా షియోమి పెన్ లను తీసుకొచ్చింది. ఎంఐ రోలర్ బాల్ పెన్, ఎంఐ ట్రావెల్ యూ షేప్ పిల్లో, ఐ లవ్ ఎంఐ టీ షర్ట్, ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్లను విడుదల చేసింది. ఎంఐ రోలర్ బాల్ పెన్ ను అల్యూమినియం బాడీతో రూపొందించారు. దీంతో పెన్నుకు ప్రీమియం లుక్ వచ్చింది. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేందుకు బాగుంటుంది.
దీంతో పాటు ఎంఐ ఫోకస్ క్యూబ్ పేరిట ఓ నూతన లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ను చైనా మేకర్ షియోమి విడుదల చేసింది. దీన్ని అధునాతన మోల్డింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. స్మూత్ కర్వ్డ్ ఎడ్జ్లను ఈ క్యూబ్ కలిగి ఉంది. దీని వల్ల యూజర్లకు సౌకర్యవంతమైన గ్రిప్ లభిస్తుంది.
ఈ క్యూబ్ను పాకెట్లలో కూడా పట్టే విధంగా సింపుల్గా తయారు చేశారు. ఈ ఎంఐ ఫోకస్ క్యూబ్ ధర రూ.199 కాగా ఎంఐ ఆన్లైన్ స్టోర్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ క్యూబ్తోపాటు ఎంఐ రోలర్ బాల్ పెన్ కు గాను రీఫిల్ను కూడా షియోమీ లాంచ్ చేసింది. ఈ రీఫిల్ ధర రూ.119 కాగా దీన్ని కూడా ఎంఐ ఆన్లైన్ స్టోర్లో కొనుగోలు చేయవచ్చు.
ఎంఐ టీషర్ట్
గతంలో ఐ లవ్ ఎంఐ టీషర్ట్ ఎంఐ బ్యాండ్ 2, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ స్మార్ట్ బ్యాండ్లను చార్జింగ్ చేసుకునేందుకు ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్ను కూడా ఎంఐ విడుదల చేసింది. ఎంఐ ట్రావెల్ యూ షేప్డ్ పిల్లో గ్రే, బీగ్ రంగుల్లో రూ.999 ధరకు లభిస్తున్నది.
ఎంఐ బ్యాండ్ 2
అలాగే ఎంఐ టీ షర్ట్ గ్రే, బ్లాక్, వైట్ రంగుల్లో రూ.399 కు లభిస్తున్నది. ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్ ధర రూ.129 గా నిర్ణయించారు. ఈ నూతన ఉత్పత్తులను నేటి అర్థరాత్రి నుంచి ఎంఐ ఆన్లైన్ స్టోర్లో విక్రయించనున్నారు.