షియోమి నుంచి ఇండియాకి సరికొత్త ఉత్పత్తులు


చైనా మొబైల్ మేకర్ షియోమి సరికొత్త ఉత్పత్తులతో ఇండియాలో దూసుకువెళుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ ని టచ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా షియోమి పెన్ లను తీసుకొచ్చింది. ఎంఐ రోల‌ర్ బాల్ పెన్‌, ఎంఐ ట్రావెల్ యూ షేప్ పిల్లో, ఐ ల‌వ్ ఎంఐ టీ ష‌ర్ట్‌, ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్‌ల‌ను విడుదల చేసింది. ఎంఐ రోల‌ర్ బాల్ పెన్ ను అల్యూమినియం బాడీతో రూపొందించారు. దీంతో పెన్నుకు ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఎవ‌రికైనా గిఫ్ట్ ఇచ్చేందుకు బాగుంటుంది.

Advertisement

ఎంఐ ఫోక‌స్ క్యూబ్

దీంతో పాటు ఎంఐ ఫోక‌స్ క్యూబ్ పేరిట ఓ నూత‌న లైఫ్ స్టైల్ ప్రోడ‌క్ట్‌ను చైనా మేకర్ షియోమి విడుద‌ల చేసింది. దీన్ని అధునాత‌న మోల్డింగ్ టెక్నాల‌జీతో త‌యారు చేశారు. స్మూత్ క‌ర్వ్‌డ్ ఎడ్జ్‌ల‌ను ఈ క్యూబ్ క‌లిగి ఉంది. దీని వ‌ల్ల యూజర్ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన గ్రిప్ ల‌భిస్తుంది.

Advertisement
ధ‌ర

ఈ క్యూబ్‌ను పాకెట్ల‌లో కూడా ప‌ట్టే విధంగా సింపుల్‌గా త‌యారు చేశారు. ఈ ఎంఐ ఫోకస్ క్యూబ్ ధ‌ర రూ.199 కాగా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

రీఫిల్‌

ఇక ఈ క్యూబ్‌తోపాటు ఎంఐ రోల‌ర్ బాల్ పెన్ కు గాను రీఫిల్‌ను కూడా షియోమీ లాంచ్ చేసింది. ఈ రీఫిల్ ధర రూ.119 కాగా దీన్ని కూడా ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఎంఐ టీష‌ర్ట్‌

గతంలో ఐ ల‌వ్ ఎంఐ టీష‌ర్ట్‌ ఎంఐ బ్యాండ్ 2, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిష‌న్ స్మార్ట్ బ్యాండ్‌ల‌ను చార్జింగ్ చేసుకునేందుకు ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్‌ను కూడా ఎంఐ విడుద‌ల చేసింది. ఎంఐ ట్రావెల్ యూ షేప్డ్ పిల్లో గ్రే, బీగ్ రంగుల్లో రూ.999 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది.

ఎంఐ బ్యాండ్ 2

అలాగే ఎంఐ టీ ష‌ర్ట్ గ్రే, బ్లాక్, వైట్ రంగుల్లో రూ.399 కు ల‌భిస్తున్న‌ది. ఎంఐ బ్యాండ్ 2 చార్జింగ్ కేబుల్ ధ‌ర రూ.129 గా నిర్ణ‌యించారు. ఈ నూత‌న ఉత్ప‌త్తుల‌ను నేటి అర్థ‌రాత్రి నుంచి ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యించ‌నున్నారు.


Best Mobiles in India

English Summary

Xiaomi launches Mi Rollerball Pen Refill in India for Rs 119