రైల్వే నుంచి కొత్త యాప్, ప్రయాణికుల కష్టాలు తీరినట్లే !
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరిం చడం కోసం రైల్వే శాఖ ‘రైల్ సురక్ష’ పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది.
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరిం చడం కోసం రైల్వే శాఖ 'రైల్ సురక్ష' పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది. ఇది ఈ నెలాఖరు నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ను ముందుగా 2016 నుంచి పుణేలో పరీక్షిస్తున్నారు. అన్నీ టెస్ట్లు పూర్తయిపోవడంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ ఫోన్లకు త్వరలో అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది.

182
ప్రయాణికులు తన సమస్యను యాప్లో పెట్టాలి. ఆ సందేశం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరుతుంది.

ఫిర్యాదు దారుడి ఫోన్ ఎక్కడ ఉందో ..
అక్కడి సిబ్బంది వెంటనే ఫిర్యాదు దారుడి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లను అప్రమత్తం చేస్తారు.

అలర్ట్
అధికారులకు ఫిర్యాదు అందిన వెంటనే అలర్ట్ అవుతారు. అధికారులు ఫిర్యాదుదారు దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.

ఉద్యోగులకు, ఆఫీసర్లకు
ఇది కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా రైల్వే ఉద్యోగులకు, ఆఫీసర్లకు కూడా ఉపయోగపడనుందని రైల్వే శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications








