అధిక ఫాస్ట్ ట్యాగ్లను జారీచేసిన Paytm పేమెంట్స్ బ్యాంక్
ఫాస్ట్ ట్యాగ్లను ఇండియాలో జారీచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPB) ఎక్కువ ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేసింది. టోల్ గేట్ దాటడానికి ఫాస్ట్ ట్యాగ్ ను ఖచ్చితం చేసినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు మూడు మిలియన్ల ట్యాగ్లను పంపిణి చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

మార్చి నాటికి ఐదు మిలియన్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్లను పేటీఎం ద్వారా పంపిణి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది గత ఒక నెలతో పోలిస్తే 40 శాతానికి పైగా ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేసినట్లు పేర్కొంది.

Paytm MD & CEO
"ఈ మైలురాయిని మేము ప్రభుత్వం యొక్క‘ డిజిటల్ ఇండియా' యొక్క ప్రయత్నాలకు నిదర్శనం. దేశంలో డిజిటల్ టోల్ పేమెంట్స్ ల స్వీకరణకు మేము కృషి చేస్తూనే ఉంటాము "అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ MD మరియు CEO సతీష్ గుప్తా చెప్పారు.

Paytm ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏమిటి?
ఫాస్ట్ ట్యాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ. దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. టోల్ పేమెంట్స్ చేయడానికి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ పేమెంట్స్ టోల్ యజమానికి అనుసంధానించబడిన ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంట్ నుండి నేరుగా చెల్లించబడతాయి.

Paytm ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులను వారి పేటీఎం వాలెట్ నుండి నేరుగా చెల్లించడానికి అనుమతిస్తుంది. ప్రత్యేక ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ను సృష్టించడం మరియు రీఛార్జ్ చేయకుండా నేరుగా వాలెట్ నుండి టోల్ పెమెంట్స్ చేయవచ్చు. మీరు కనీస డాక్యుమెంటేషన్తో ఫాస్ట్ ట్యాగ్ ను కొనుగోలు చేయవచ్చు. వీటిలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు సర్టిఫికేట్ ఉన్నాయి. ట్యాగ్ మీరు ఇవ్వబడిన చిరునామాలో ఉచితంగా డెలివరీ చేయబడుతుంది.

నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రోగ్రామ్ కోసం భారతదేశంలో రెండవ అతిపెద్ద కొనుగోలు బ్యాంకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. Paytm FASTag భారతదేశం అంతటా 110 టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ నగదు రహిత పేమెంట్స్ లను అనుమతిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో 10,000 మంది వ్యాపార కరస్పాండెంట్లతో ఈ ఫాస్ట్ ట్యాగ్ల అమ్మకాన్ని మరింతగా పెంచుతోంది.

నగదు రహిత పేమెంట్స్ సౌలభ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం అంతటా టోల్ ప్లాజాలలో 300 కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసింది. షాజహాన్పూర్లో అత్యధిక ITC ట్రాఫిక్ ప్లాజాను PPB సొంతం చేసుకుంది. ఇది అత్యధిక ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను నమోదు చేస్తుంది. ఇంకా బ్యాంకు ప్రయత్నాలలో దేశంలోనే అత్యధికంగా గుజరాత్లోని మాఖెల్ టోల్ ప్లాజా వద్ద 50 శాతం డిజిటలైజేషన్ సాధించాయి.


Click it and Unblock the Notifications








