ప్రపంచంలో నంబర్ వన్ బ్యాంకు కావడమే లక్ష్యం : పేటీఎమ్
ప్రముఖ చెల్లింపుల దిగ్గజం పేటీఎం బ్యాంకును అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఈ బ్యాంకును అట్టహాసంగా ప్రారంభించారు.
ప్రముఖ చెల్లింపుల దిగ్గజం పేటీఎం బ్యాంకును అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఈ బ్యాంకును అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా జీరో బ్యాలెన్స్తో, ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి రుసుము లేకుండా ఈ సేవలను తీసుకువచ్చినట్లు పేటీఎమ్ తెలిపింది.

పొదుపు ఖాతాపై వడ్డీని కూడా అందజేయనున్నట్లు.. ఖాతాదారులు తమ డబ్బును ఏ ఏటీఎం కేంద్రం నుంచైనా డ్రా చేసుకోవచ్చని తెలిపింది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ బ్యాంకును సృష్టించాలని లక్ష్యంగా పేటీఎమ్ ముందుకు దూసుకుపోతోంది. 2020 నాటికి 500 మిలియన్ ఖాతాలను పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

బ్యాంకు సేవలు అందని వారిని లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది.'డిజిటల్ చెల్లింపుల బ్యాంక్ అనేది మా ఎంట్రీ పాయింట్ మాత్రమే.. సమీకృత ఆర్థిక సేవల సంస్థగా మేం మారాలనుకుంటున్నాం.' అని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శంకర్ శర్మ తెలిపారు.

కేవైసీ(నో యువర్ కస్టమర్) కార్యక్రమంపై దాదాపు 500 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని పేటీఎం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లను ఏర్పాటు చేసే యత్నాల్లో ఆ సంస్థ ఉంది.


Click it and Unblock the Notifications








