రాబోయే రోజుల్లో WhatsApp కాల్స్ కట్ దీనికి కారణం ఎవరో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా WhatsApp లో కమ్యూనికేషన్ ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. యూజర్లకు కమ్యూనికేట్ చెయ్యడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ మెసెంజర్ అప్ WhatsApp అని చెప్పడం లో ఎటు వంటి సందేహం లేదు . కానీ భారత ప్రభుత్వం WhatsApp లో ఉన్న కాలింగ్ ఫీచర్ ని వెంటనే బ్యాన్ చేయాలి అనుకుంటుంది అని సమాచారం.

భారత ప్రభుత్వం WhatsApp కాలింగ్ ఫీచర్ ని బ్లాక్ చేయవచ్చని ఊహిస్తున్నారు. దేశపు సరిహద్దులో తీవ్రవాదుల మధ్య జరిగే కమ్యూనికేషన్ను అరికట్టేందుకు భారతీయ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోబుతుంది .
ఉగ్రవాద కార్యకలాపాల కోసం WhatsApp ని వినియోగించారని వెలుగులోకి వచ్చిన మొదటి సంఘటన 2016 నాగ్రోటా ఆర్మీ క్యాంప్ వద్ద జరిగిన దాడి.ఉగ్రవాదులు తమ సహచరులతో కమ్యూనికేట్ చేయడానికి WhatsApp ను ముఖ్య వేదికగ ఉపయోగించారని వెల్లడించారు. మన దేశపు బోర్డర్ లో కూడా ఉగ్రవాదులు సహచరులతో కమ్యూనికేట్ చేయడానికి WhatsAppను ఉపయోగిస్తున్నారని NIA (National Investigation Agency)కనుగొంది.
భారతదేశంతో సహా అనేక దేశాలకు ఇది ప్రధానంగా ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం భారత హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక మీటింగ్ ను నిర్వహించింది.ఈ మీటింగ్ లో MeitY (Ministry of Electronics and Information technologies), DoT (Department of Telecommunication) నుంచి వచ్చిన అధికారులు కొందరు ప్రముఖులతో పాటు కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.

రాబోయే రోజుల్లో Whatsapp లో కొత్త విధానాలను ప్రవేశ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ఫాంపై ఎటువంటి క్రిమినల్ కార్యకలాపాలను జరగకుండా కఠినమైన ఐటి చట్టాలను తీసుకరాబోతుంది .


Click it and Unblock the Notifications