కానన్ కొత్త శ్రేణి డిఎస్ఎల్ఆర్ కెమెరా!!

ఈ మార్చితో కానన్ మరో మైలు రాయిని దిగ్విజయంగా అధిరోహించింది. కంపెనీ తొలిగా రూపొందించిన ‘EOS SLR’ కెమెరాకు ఈ ఏడాది మార్చితో 25 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ నేపధ్యంలో కానన్ తన డిఎస్ఎల్ఆర్ లైన్ప్ నుంచి ఉత్తమ శ్రేణి కెమెరాను రూపొందించింది. ‘EOS 5D Mark III’ మోడల్లో వస్తున్న ఈ కెమెరా పూర్తి స్ధాయి ప్రొఫెషనల్ హోదాను కలిగి ఉంటుంది. కెమెరా కీలక స్పెసిఫికేషన్లు:
* 3.2 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే.
* డ్యూయల్ మెమెరీ ఎస్డీ మరియు కాంపాక్ట్ ఫ్లాస్.
* మన్నికైన 14 బిట్ డిజిక్ 5+ ప్రాసెసర్ను కెమెరాలో ఏర్పాటు చేశారు.
* 22.3 మెగా పిక్సల్ ఫుల్ ఫ్రేమ్ సిఎమ్వోఎస్ సెన్సార్, 61 పాయింట్ రెటికులర్ ఆటోఫోకస్ తో.
* ISO పరిధి 50 నుంచి 102,400 వరకు,
* 1080 పిక్సల్ రిసల్యూషన్ తో వీడియోలను రికార్డ్ చేసుకునే సౌలభ్యత,
* హెడ్ఫోన్ జాక్ సౌలభ్యత,
* ప్రతికూల వాతవరణాల్లో కెమెరా చెక్కుచెదరకుండా పని చేసే విధంగా డస్ట్ ప్రూఫ్ వ్యవస్థ,
* వివిధ యాంగిల్స్లో ఫోటోలను చిత్రీకరించేందుకు గాను పలు క్రియేటివ్ ఆప్షన్లను కెమెరాలో లోడ్ చేశారు.
మార్చి చివరాకరి నుంచి ఈ ఉత్తమ క్వాలిటీ కెమెరాలు మార్కెట్లో లభ్యంకానున్నాయి. ధర అంచనా రూ.1,75,000.


Click it and Unblock the Notifications








