రూ1000 కోట్ల లక్ష్యం: పూజిఫిల్మ్

ఫోటో కెమెరా తయారీ కంపెనీ అయిన పూజిఫిల్మ్ రానున్న మూడు సంవత్సరాలలో రూ 1000 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను చిన్న పట్టణాలపై దృష్టిని సారించనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి టనక తెలిపారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లతో ముగిస్తుందని అంచనా వేయడం జరిగిందని పేర్కొన్నారు. భారత్ డిజిటల్ కెమరాల మార్కెట్లో తమకు 7.1 శాతం వాటా కలిగి ఉన్నామని చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మార్కెట్ వాటా సాధించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశంలో మొత్తంగా 40 లక్షల యూనిట్ల కెమారాలు అమ్మకాలు అవుతామని, ఇందులో 15 శాతం వాటా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూజిఫిల్మ్ గురువారం రూ.99,999 విలువ చేసే ఎక్స్ ప్రొల్ కెమరాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్స్-ఎస్1, జెజడ్, టి 350 మోడల్ కెమరాలను దేశీయా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications








