మార్కెట్లోకి సామ్సంగ్ స్మార్ట్ కెమెరాలు!

సామ్సంగ్ తాజాగా డబ్ల్యు బి, ఎస్టి, ఇఎస్, డివి సీరిస్లో ఐదు స్మార్ట్ కెమెరాలను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త కెమెరాల్లో డబ్ల్యుబి100 కెమెరా 26ఎక్స్ హైజూమ్ లెన్స్తో ఉండగా.. ఎస్టి 200ఎఫ్, డివి 300ఎఫ్ కెమెరాల్లో వైఫ్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. ఎస్టి 66, డివి 100, ఇఎస్90 కెమెరాల్లో ఆధునిక ఫీచర్లున్నాయి. డబ్ల్యుబి 100 కెమెరాలో 3డి ఫొటోను తీసే సదుపాయం కూడా ఉంది. దీని ధర 14,490 రూపాయలు. డివి 300ఎఫ్ ధర 12,400 రూపాయలు, డివి 100 ధర 8,900 రూపాయలు, ఎస్టి 200 ఎఫ్ ధర 12,400 రూపాయలు, ఎస్టి 55 ధర 7,900 రూపాయలు, ఇఎస్ 90 ధర 6,400 రూపాయలుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








