అక్టోబర్ 5న ఇండియాలో ఓ అద్బుతం...

By Super
|
A Computer for Rs. 1,750 unveiled
ఇంటర్నెట్ ప్రపంచంలో కంప్యూటర్ ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో అందరికి తెలిసిందే. అసలు మొట్టమొదటి సారి కంప్యూటర్ చార్లెస్ బాబేజి కనిపెట్టడం జరిగింది. అప్పట్లో అది ఓ పెద్ద రూమ్ అంతలా ఉండేదని చెబుతుంటారు. రాను రాను కంప్యూటర్ రూపోందించే విధానంలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడంతో కంప్యూటర్ సైజు, ధర రెండూ కూడా తగ్గతూ వచ్చాయి. ఎంతలా తగ్గుతూ వచ్చాయంటే వచ్చే నెలలో మన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కంప్యూటర్‌ని రూ 1750కే అందుబాటులోకి తీసుకొని వచ్చేటంతలా...

ఇటీవల అమెరికాలో కూడా ఐప్యాడ్‌లను స్కూల్ పిల్లలు చదువుకొవడానికి నిమిత్తం ఫ్రీగా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పద్దతిని ఇండియాలో తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కపిల్ సిబల్ మాట్లాడుతూ కంప్యూటర్‌ అనేది పాఠశాల నుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల హక్కు అని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా కంప్యూటర్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేవలం రూ.1750 (35 డాలర్లు)కే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ కంప్యూటర్‌ని వచ్చే నెల ఐదో తేదిన ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అసలు రూ.1750కి కంప్యూటర్ ఏంటనీ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగానే నిజం. దీనిని విడుదల చేయడానికి కారణం రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది చదువులలో కీలకపాత్ర పోషించనుంది కాబట్టి ఇప్పటి నుండే విద్యార్దులకు కంప్యూటర్‌‌ని చేరువ చేసే భాగంలో దీనిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కంప్యూటర్‌కి పెట్టిన పేరు 'మయ'. ఈ కంప్యూటర్‌లో నెట్‌ను కూడా ఉపగించుకోవడంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X