ఢిల్లీ ఎఫెక్ట్.. దేశ వ్యవస్థనే మార్చేస్తుందా..!!

టాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం దేశవ్యాప్తంగా విస్త్ళతమవుతున్న నేఫద్యంలో ప్రముఖ విద్యాసంస్థ ‘యక్రాస్ వరల్డ్’, ఓ ఢిల్లీ ఆధారిత సంస్థ ‘గో టెక్’తో జత కట్టి ఆండ్రాయిడ్ టచ్ స్ర్కీన్ టాబ్లెట్ను రూపొందింస్తుంది. ‘ATab’గా రానున్న ఈ ఆండ్రాయిడ్ డివైజ్ ధర రూ.5,000. ప్రధానంగా ఈ కంప్యూంటింగ్ పరికరాన్ని యువత మరియు విద్యార్థులను ద్ళష్టిలో ఉంచుకుని రూపొందించారు. మార్చి రెండవ వారంలో ఈ పీసీని దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘ATab’ టాబ్లెట్ ప్రధాన ఫీచర్లు:
* 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ప్లే,
* శక్తివంతమైన 1.1GHz ప్రాసెసర్,
* 3జీ యూఎస్బీ డాంగిల్,
* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఇన్బుల్ట్ మెమెరీ 2జీబి,
* విస్తరించదగిన మెమరీ 16జీబి,
* వై-ఫై కనెక్టువిటీ,
* బ్లూటూత్ కనెక్టువిటీ,
* ఐదు కలర్ వేరియంట్లలో ఈ పీసీ లభ్యమవుతోంది.
మూడేళ్ల పాటు ఉచితంగా!!
టాబ్లెట్ కోనుగోలు పై మూడేళ్ల పాటు యక్రాస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అపరిమిత యాక్సెస్ను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాట్ఫామ్ ఆధారితంగా విద్యకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చు. తరగతి గదుల్లో ఈ పీసీల వినియోగాన్ని ముమ్మరం చేసిన అంతర్జాతీయ స్థాయిలో బోధనా ప్రమాణాలను తీర్చిదిద్దాలని విద్యా సంస్థలు యోచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








