కేంద్రీకృతమైన ‘ఏసర్’ తుఫాన్..?

By Prashanth
|
Acer Quad Core Tablets


ప్రముఖ టాబ్లెట్ పీసీ తయారీదారు ‘ఏసర్’ ఆడ్వాన్సడ్ అత్యాధునిక క్వాడ్ కోర్ టాబ్లెట్ కంప్యూటర్ పరికరాలను మార్కెట్లో విడుదల చేయునుంది. ఏసర్ ఐకోనియా ‘క్వాడ్ కోర్ 510’, ‘క్వాడ్ కోర్ 511’ వర్షన్ లలో ఈ గ్యాడ్జెట్లు లభ్యం కానున్నాయి.

క్లుప్తంగా వీటి ఫీచర్లను పరిశీలిస్తే:

ఆండ్రాయిడ్ v4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ వ్యవస్థను ఈ రెండు వేరియంట్లలో లోడ్ చేశారు. ఏర్పాటు చేసిన న్విడియా టెగ్రా 3 SoC ప్రాసెసర్లు పటిష్టమైన పనితీరును కలిగి ఉంటాయి. ఈ పీసీల పిక్సల్ రిసల్యూషన్ 1280 x 800. డేటా ట్రాన్సఫరింగ్ కనెక్టువిటీ అంశాలకు సంబంధించి ‘క్వాడ్ కోర్ 510’లో ఆధునిక వై-ఫై , 3.5 mm ఆడియో జాక్, హెచ్డీఎమ్ఐ పోర్టు వ్యవస్థలను పొందుపరిచారు.

డేటా ట్రాన్సఫరింగ్ కనెక్టువిటీ అంశాలకు సంబంధించి‘క్వాడ్ కోర్ 511’లో అత్యాధునిక వై-ఫై వ్యవస్థతో పాటు బ్లూటూత్, 3.5 mm ఆడియో జాక్, హెచ్డీఎమ్ఐ పోర్టులను ఏర్పాటు చేశారు. ఈ రెండు పీసీలలో మెమరీని 64జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లతో పాటు ఇతర మెసేజింగ్ ఫీచర్లను ఇరు పీసీలలో ముందుగానే అప్‌లోడ్ చేశారు. 2012 ప్రధమాంకంలో ఈ పీసీలను విడుదల చేసే యోచనలో ‘ఏసర్’ ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X