అమెజాన్ కైండిల్ఫైర్ పేపర్వైట్ ఇ-బుక్ రీడర్లు
ప్రముఖ రిటైలర్ అమెజాన్ తన కైండిల్ సిరీస్ నుంచి సెకండ్ జనరేషన్ పేపర్వైట్ ఇ-బుక్ రీడర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఇవి వై-ఫై ఇంకా 3జీ వేరియంట్లలో లభ్యంకానున్నాయి . వై-ఫై వేరియంట్ ధర రూ.10,999. 3జీ వేరియంట్ ధర రూ.13,999.

అమెజాన్ ఇ-బుక్ రీడర్లు దేశవ్యాప్తంగా 250 రిటైల్ అవుట్లెట్లలో లభ్యమవుతాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, హైదరాబాద్, చండీఘడ్, అహ్మదాబాద్ ఇంకా పూణేలోని క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇ-జోన్, విజయ సేల్ స్టోర్స్ వద్ద ఈ పరికరాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ సరికొత్త కైండిల్ పేపర్వైట్ రీడర్లు 6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటాయి. రిసల్యూషన్ సామర్ద్యం 1024 x 768పిక్సల్స్, అలానే 212 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. సరికొత్త డిస్ప్లే టెక్నాలజీ, వేగవంతమైన ప్రాసెసర్, నాణ్యమైన టచ్సెన్సిటివిటీ. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే... డ్యుయల్ వై-ఫై బీ/జీ/ఎన్ సపోర్ట్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ (1000 ఇ-పుస్తకాలను దాసుకోవచ్చు).
ఈ సరికొత్త ఇ-రీడర్లలో ‘కైండిల్ పేజ్ ఫ్లిఫ్ ఇన్-లైన్ ఫుట్ నోట్స్', ‘ఫ్రీ టైమ్', ‘వొకాబులరీ బిల్డర్', ‘న్యూ స్మార్ట్ లుకప్' వంటి ఆధునిక ఫీచర్లను ఏర్పాటు చేసారు. అలానే, ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్వెబ్సైట్లకు అనుసంధానం కావచ్చు. ఈ సరికొత్త కైండిల్ ఇ-బుక్ రీడర్ బరువు 206 గ్రాములు. సింగిల్ బ్యాటరీ చార్జ్ పై 8 వారాల బ్యాకప్ను పొందవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications