కన్‌ఫ్యూషన్ ఎందుకు ‘ఫ్యూషన్’ ఉండగా..!!

By Super
|
AMD Fusion powered Notebooks in India
ఇక ల్యాప్‌టాప్‌లు, నోటుబుక్‌లు కోనుగోలు విషయంలో కన్‌ఫ్యూషన్ వద్దు.. ఎందుకంటే ‘ఏఎమ్‌డి ఫ్యూషన్’ (AMD Fusion) వ్యవస్థతో రూపుదిద్దకున్న పరికరాలు భారత్‌ మర్కెట్లో లభ్యమవుతున్నాయి. నోట్ బుక్ పరికరాల్లో విప్లవాత్మక ఒరవడిని తెచ్చిన ఏఎమ్‌డి చిప్ వ్యవస్థ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. లెనివో, తోషిబా బ్రాండ్ల తాజాగా ‘ఏఎమ్‌డి ఫ్యూషన్’ చిప్ సెట్లను అమర్చిన ల్యాప్‌టాప్‌లతో పాటు నోట్‌బుక్‌లను మార్కెట్లో విడుదల చేశారు.

సాంకేతిక పరికరాల తయారీలో ప్రఖ్యాతి గాంచిన తోషిబా, లెనివోలు ఈ ఏఎమ్‌డి లయనో (A సరీస్) వ్యవస్థతో కూడిన ల్యాప్‌టాప్‌లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయతే తొలిత ఈ బ్రాండ్లు ‘ఏఎమ్‌డి చిప్ వ్యవస్థ’ను నోట్‌బుక్‌లలో ప్రవేశ పెట్టి, ఈ ఏడాది మొదట్లోనే పలు దేశాల్లో విడుదల చేశారు. అయితే వీటి అమ్మకాలు ఇప్పటికి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నోట్ బుక్ ధరలను పరిశీలిస్తే రూ.18,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

అయితే తోషిబా (Toshiba) వారం క్రిందట మూడు సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు రూ.24,750 నుంచి మొదలవుతున్నాయి. ఈ మోడళ్లలో ప్రధానమైన ‘L775D-S7226’ మెడల్ అడ్వాన్స్‌డ్ వర్షన్‌తో రూపుదిద్దుకుంది. అయితే దీని ధర మార్కెట్లో రూ.27,000 ఉంది. మరో బ్రాండ్ లెనివో (Lenovo), రెండు సరికొత్త నోట్‌బుక్‌లను మార్కెట్లో విడుదల చేసింది. 15.6, 14 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌‌టాప్‌లు ధరలు రూ. 24,750 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిలో పొందుపరిచిన ‘ఏఎమ్‌డి ఫ్యూషన్ చిప్’ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటంతో పాటు తక్కువ విద్యుత్‌ని ఖర్చు చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X