భారత్‌లో ఆపిల్ కొత్త ఐప్యాడ్!

By Super
|
Apple New iPad now in India

టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త వెర్షన్ ఐప్యాడ్‌ను శుక్రవారం భారత మార్కెట్టో విడుదల చేసింది. ఆపిల్ ఇప్పటి వరకు రూపొందంచిన టాబ్లెట్ కంప్యూటర్లలో ఐప్యాడ్ 3 మరింత ఆధునీకతను సంతరించుకుంది. ఈ కొత్త టాబ్లెట్ వై-ఫై, వై-ఫై+4జీ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఐప్యాడ్ -2కు అప్‌డేటెడ్ వర్షన్‌గా మార్చి 7న మార్కెట్లో లాంఛ్ అయిన ఐప్యాడ్ 3, ఈ నెల 27 నుంచి భారత్‌లో లభ్యమవుతుందని ఇదువరుకే ప్రకటించారు. రెండు వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఐప్యాడ్ 3 ధరల వివరాలు క్లుప్తంగా:

 

వై-ఫై వేరియంట్.. 16జీబి- రూ.30,500, 32జీబి – రూ.36,500, 64జీబి – రూ.42,500.

 


వై-ఫై+ 4జీ వేరియంట్.. 16జీబి- రూ.38,900, 32జీబి – రూ.44,900, 64జీబి – రూ.50,900.

ఇండియాతో పాటు కొలంబియా, ఎస్టోనియా, ఇస్రేల్, లాట్వియా, లిథువేనియా, మోంటెనెగ్రో, దక్షిణాఫ్రికా, థాయిలాండ్ దేశాల్లో కొత్త ఐప్యాడ్ లాంఛ్ అవుతుంది. మరో 12 దేశాల్లో ఈ నెల 20నే కొత్త ఐప్యాడ్‌ను ప్రవేశపెట్టారు. దింతో ఆపిల్ కొత్త ఐప్యాడ్ లభ్యమయ్యే దేశాల సంఖ్య 55కు చేరుకుంటుంది.మరోవైపు, ఐప్యాడ్2 రేట్లను యాపిల్ తగ్గించింది. దీంతో ఇకపై 16జీబీ వైఫై మోడల్ రూ.24,500కే లభించనుంది. అదే వైఫై+3జీ వెర్షన్ ఐప్యాడ్ రేటు రూ. 32,900.

ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రధాన ఫీచర్లు:

రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్),


డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5X ప్రాసెసర్,


క్వాడ్‌కోర్ గ్రాఫిక్ యూనిట్,


5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,


10 గంటల బ్యాటరీ లైఫ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X