గురువారం మార్చి ఒకటి... అలా జరగింది!!

న్యూఢిల్లీ: అసస్ కొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘ఇ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమ్’ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఉత్సాహభరిత వాతవరణం నడుమ ఈ పీసీని అసస్ ఇండియా వర్గాలు విడుదల చేసాయి. ప్రపంచపు మొట్టమొదటి క్వాడ్కోర్ సీపీయూ టాబ్లెట్గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఇ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమ్’ ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ వోఎస్ను ఉచితంగా ఆండ్రాయిడ్ 4.0కు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన క్వర్టీ చిక్లెట్ కీబోర్డ్ వ్యవస్థ అదే విధంగా కీబోర్డ్ డాక్ సౌలభ్యతలు సౌకర్యవంతమైన టైపింగ్కు తోడ్పడుతాయి.
* 10 అంగుళాల మల్టీ టచ్స్ర్కీన్ ఐపీఎస్+ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
* ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,
* 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
* 1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
* 1జీబి ర్యామ్,
* అత్యాధునిక వై-ఫై వ్యవస్థ,
* మైక్రో హెచ్డిఎమ్ఐ పోర్ట్,
* మెమరీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్స్లాట్,
* 32జీబి, 64జీబి వేరియంట్ లలో ఈ టాబ్లెల్లు లభ్యం కానున్నాయి.
* ధర రూ. 49,999.


Click it and Unblock the Notifications








