‘భారతీయుని’ కల నెరవేరనుంది..!!

అసాధ్యాన్ని.. సుసాధ్యం చేస్తూ ‘భారత్ ఎలక్ట్రానిక్స్’ (Bharat Electronics) ఓ వినూత్న ఓరవడికి శ్రీకారం చుట్టుంది. ఈ ఒరవడితో సగటు భారతీయుని కల నెరవేరనుంది.. ఈ ప్రక్రియతో లక్షల సంఖ్యలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధిపొందుతాయి. దేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టారైన ‘భారత్ ఎలక్ట్రానిక్స్’ అతి తక్కవు ధరతో కూడిన టాబ్లెట్ పీసీని లాంఛ్ చేసింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ టాబ్లెట్ పేరు ‘స్లేట్’ (slate). ఈ సాంకేతిక పరికరాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు చేరువచేసే క్రమంలో భారతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ టాబ్లెట్ను డిజైన్ చేసింది. రూ.3000 వేల నిర్థేశిత ధరతో ఈ టాబ్లెట్ పీసీలను విక్రయించేందుకు ‘బెల్’ ప్రణాళికలు రూపొందిస్తుంది.
ఈ టాబ్లెట్ విశిష్టతలను పరిశీలిస్తే స్లేట్ లో పొందుపరిచిన బ్యాటరీ సోలార్ వ్యవస్థతో ఛార్జింగ్ అవుతుంది. అయితే బెల్ ఈ సంవత్సరంలోనే 6 లక్షల టాబ్లెట్ పీసీలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే వీటి అమ్మకం ద్వారా బెల్ కు ఆదాయం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల వరకు ఉండొచ్చని పోవర్టీ సర్వేలో తేలింది. అయితే విడుదల కాబోతున్న ‘భారత్ స్లేట్’ పీసీల పై భారీ అంచనాలే నెలకున్నాయి. ఒక వేళ ఈ టాబ్లెట్ పీసీ మార్కెట్లో క్లిక్ అయితే మిగిలిన కంపెనీలు ధర విషయంలో ఆలోచించాల్సిందే.


Click it and Unblock the Notifications








