బీఎస్ఎన్ఎల్ వై-ఫై నెట్వర్క్ మాడ్యుల్ : ఇక కార్లలోనూ వేగవంతమైన ఇంటర్నెట్
ఇండోర్: ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇండోర్ విభాగం, కార్లకు సంబంధించి మొట్టమొదటి వై-ఫై నెట్వర్క్ మాడ్యూల్ను బుధవారం ఆవిష్కరించింది. ఈ సరికొత్త సాంకేతికత కారు ప్రయాణంలోనూ వేగవంతమైన ఇంటర్నెట్ను చేరువచేస్తుంది. ఈ తరహా టెక్నాలజీని దేశంలో తొలిగా ప్రవేశపెట్టిన ఘనత బీఎస్ఎన్ఎల్కు చెల్లింది.

ఈ వై-ఫై ఆధారిత మాడ్యుల్ ధర రూ. 5,000 నుంచి రూ. 6,000 మధ్య ఉంటుంది. తొలిగా ఈ మాడ్యుల్ను బీఎస్ఎన్ఎల్ ఇండోర్ విభాగం అధికారిక కార్కు ఇన్స్స్టాల్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించటం జరిగింది. మాడ్యుల్ ఇన్స్స్టాలేషన్లో భాగంగా కారుకు జతచేసే యాంటీనా 3.5ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ సిగ్నళ్లను అందుకోగలదు.
స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








