ఈ టాబ్లెట్ను ల్యాప్టాప్లా కూడా......

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ బియాండ్ టెక్ తన మైబుక్ లైనప్ నుంచి ‘ఎల్9’ పేరుతో సరికొత్త టాబ్లెట్ను విపణిలోకి తెచ్చింది. ప్రత్యేక కీబోర్డ్ సాయంతో ఈ టాబ్లెట్ను ల్యాపీలా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.8,499.
స్సెసిఫికేషన్లు:
బరువు ఇంకా చుట్టుకొలత: బరువు 474 గ్రాములు, శరీర కొలత 261.6 x 165.1 x 11మిల్లీ మీటర్లు,
డిస్ ప్లే: 9 అంగుళాల 5 పాయింట్ కెపాసిటివ్ టచ్స్ర్కీన్ డిస్ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, 32జీబి ఎక్ప్ప్యాండబుల్ మెమెరీ,
కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: యూఎస్బీ వోటీజీ, ఎక్స్టర్నల్ 3జీ డాంగిల్స్, హెచ్డిఎమ్ఐ అవుట్, వై-ఫై,
బ్యాటరీ: 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ప్రీలోడెడ్ అప్లికేషన్లు: వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్, ఉచిత కీబోర్డ్.
ధర : రూ.8,499.
పోటీగా పాంటెల్ ‘డబ్ల్యూఎస్802సీ-2జీ’
పాంటెల్ టెక్నాలజీ తన టాబ్లెట్ పీసీల లైనప్ను మరింత పటిష్టం చేస్తూ ‘డబ్ల్యూఎస్802సీ-2జీ’ శ్రేణిలో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.8,299. వాయిస్ కాలింగ్ ప్రత్యేకతతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ను యూజర్ పొందవచ్చు. ఆఫర్లో భాగంగా 4జీబి డాటాను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. డివైజ్ కొనుగోలు పై రూ.1499విలువ చేసే కీబోర్డ్ను పాంటెల్ ఆఫర్ చేస్తోంది.
స్పెసిఫికేషన్లు:
8 అంగుళాల కెపాసిటివ్ డిస్ప్లే,
సిమ్కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3జీ డాంగిల్ వయా యూఎస్బీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








