బియాండ్ ఫాబ్లెట్ పీ3 (స్మార్ట్ఫోన్+ట్యాబ్లెట్)

పూణేకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘బియాండ్ టెక్’ 6 అంగుళాల డిస్ప్లే స్ర్కీన్లో హైబ్రీడ్ డివైస్ను మార్కెట్లోకి తెచ్చింది. పేరు ఫాబ్లట్ పీ3, ధర రూ.14,499. ఈ పెద్దతెర గాడ్జెట్ను స్మార్ట్ఫోన్ అలానే ట్యాబ్లెట్లా ఉపయోగించుకోవచ్చు. ఈ కాంభినేషన్ అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
కీలక స్పెసిఫికేషన్లు:
6 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ 5-పాయింట్ మల్టీ-టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, వై-ఫై, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ బహుళ ఉపయోగకర డివైస్ను ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్కార్ట్ రూ.14,499కి ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








