డిజిటల్ ప్రపంచంలో.. ‘సిస్కో’ మార్క్!!!

డిజిటెల్ ప్రపంచంలో రోజుకో కొత్త సంస్కరణ చోటుచేసుకుంటున్న నేపధ్యంలో గ్లోబల్ కంపెనీ సిస్కో (Cisco)కొత్త ఏడాదికి గాను వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రఖ్యాత గ్లోబల్ కంపెనీ టాబ్లెట్ పీసీల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది 7 అంగుళాల స్క్ర్రీన్ వేరియంట్లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సరికొత్త ప్రభంజనానికి శ్రీకారం చుట్టింది.
2012లో సిస్కో విడుదలచేయుబోతున్న టాబ్లెట్ కంప్యూటర్లు ఆధునిక ఆండ్రాయిడ్ వర్షన్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటంగ్ వ్యవస్థను లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. అదేవిధంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఈ డివైజ్ల్లో పొందుపరచినట్లు తెలుస్తోంది.
అన్ని వర్గాలు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా యూజర్ ఫ్రెండ్లీ ఫ్లెక్సీబుల్ ఫీచర్లను ఈ పీసీల్లో బలోపేతం చేసినట్లు స్పష్టమవుతోంది. ధర ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications








