గెలిపిస్తే ఫ్రీగా ల్యాప్టాప్..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని యువతను ఆకట్టుకునే క్రమంలో రాజకీయ పార్టీలు వేసిన ఎత్తుగడ ఫలించింది. మా పార్టీను గెలపిస్తే విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ పీసీలు ఇస్తామంటూ యూపీలో ఘన విజయం సాధించిచ సమాజ్ వాది పార్టీతో సహా గోవా, పంజాబ్ రాష్ట్రాలో గద్దెనెక్కిన శిరోమణి ఆకాలీదళ్, బీజేపీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామి ఇచ్చాయి. అంతిమంగా ఆయా రాష్ట్ర్రాల్లో ఈ పార్టీలే పాలనా పగ్గాలు చేపట్టటంతో కంప్యూటర్ల తయారీ కంపెనీలకు 30 వేల కోట్ల బేరం తగిలినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హెచ్ సిఎల్, లెనోవో, హెచ్పీ, ఏసర్ వంటి ప్రఖ్యాత కంపెనీలు వీటి తయారీకి సంబంధించి టెండర్లను దక్కించుకునే రేస్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








