ఈ ‘సిక్స్’ పై, ఓ సెక్సీ లుక్ వేయండి!

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదల కాబోతున్న సరికొత్త గుగూల్ టాబ్లెట్ ‘నెక్సస్ 7’ పరిశ్రమలో గొప్ప విజయాన్ని నమోదు చేస్తుందని మార్కెట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రూ.11,300ధరకే ఈ టాబ్లెట్ లభ్యం కావటం మరో విశేషం. అయితే, తక్కువ ధరకే లభ్యమవుతున్న ఈ టాబ్లెట్ పీసీలో చిన్న చిన్న లోపాలు వినియోగదారులను నిరుత్సాహానికి గురి చేస్తాయి. పీసీలో మెమరీ కార్డ్ స్లాట్ను ఏర్పాటు చేయకపోవటంతో మెమెరీని పెంచుకునే ఆస్కారం లేదు. కేవలం 8జీబి ఆన్బోర్డ్ మెమెరీతో సరిపెట్టుకోవాలి. రేర్ కెమెరా లోపించింది. ఇదో పెద్ద మైనస్గా భావించవచ్చు. హెచ్డిఎమ్ఐ పోర్ట్ సైతం డివైజ్లో కొరవడింది. ఈ నేపధ్యంలో ‘గుగూల్ నెక్సస్ 7’ ప్రత్యామ్నాయంగా నిలిచిన ఐదు టాబ్లెట్ పీసీల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో...
సామ్సంగ్ గెలాక్సీ టాబ్ 2.7.0:
నెక్సస్7కు ప్రత్యామ్నాయంగా సామ్సంగ్ గెలాక్సీ టాబ్ 2.7.0ను భావించవచ్చు. ఈ డివైజ్లో జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం మినహా ఎక్స్ప్యాండబుల్ మెమెరీ సపోర్ట్ , రేర్ కెమెరా వ్యవస్థలు ఒదిగి ఉన్నాయి. ధర రూ.14,200.


Click it and Unblock the Notifications








