ఫుజిట్సు నుంచి విండోస్ 8 టాబ్లెట్

By Prashanth
|

Fujitsu

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ఫుజిట్సు (Fujitsu) విండోస్ 8 ఆధారితంగా స్పందించే సరికొత్త హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైజ్ ను మార్కెట్లోకి తెచ్చింది. డివైజ్ పేరు ‘స్టైలిస్టిక్ క్యూ702’(STYLISTIC Q702)ఈ బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ పరికరాన్ని టాబ్లెట్ అలానే నోట్ బుక్ లా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.69,000 (కీబోర్డ్ ఇతర పన్నులు కలుపుకుని).

<strong>డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)</strong>డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)

స్సెసిఫికేషన్ లు:

- విండోస్ 8 ఆపరటింగ్ సిస్టం,

- ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ యాంటీ-గ్లేర్ 11.6 అంగుళాల హైడెఫినిషన్ డ్యూయల్ డిజిటైజర్ మల్టీ-టచ్ డిస్ ప్లే, పెన్ ఇంకా టచ్ ఇన్ పుట్,

- కీబోర్డ్ డాకింగ్ స్టేషన్ (4 - సెల్ బ్యాటరీ), ల్యాన్ పోర్ట్ (ఆర్ జే-45) ఇంకా ఎక్సటర్నల్ డిస్ ప్లే సపోర్ట్ (వీజీఏ),

- యూఎస్బీ (2.0, 3.0), హెచ్ డిఎమ్ఐ, ఎస్ డి/ఎస్ డిహెచ్ సీ,స

- ఆప్షనల్ 3జీ/యూఎమ్ టీఎస్, 4జీ/ఎల్ టీఈ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సపోర్ట్,

- యాక్సిలరోమీటర్, గైరోమీటర్, మ్యాగ్నో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్స్,

- ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరా.

వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎఫ్-074 3జీ’

జపాన్‌కు చెందిన బహుళ జాతి టెక్ దిగ్గజం ఫుజిట్సు, ప్రముఖ భారతీయ టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకొమోతో చేతులు కలిపింది. ఈ ఇరువురి భాగస్వామ్యంతో సరికొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎఫ్-074 3జీ’మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ అల్ట్రాసిమ్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,900 ధరకు బెంగుళూరులోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో టాటా డొకొమో యూజర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

టాటా డొకొమో, ఫుజిట్సు ఎఫ్-074 3జీ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

అల్ట్రాస్లిమ్ (కేవలం 6.7మిల్లీమీటర్ల మందం),

బరువు 105 గ్రాములు,

పటిష్టమైన స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,

ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్ర్కీన్ సైజ్ తెలియాల్సి ఉంది,

5మెగా పిక్సల్ కెమెరా,

ప్రత్యేకతలు:

ఈ ఫోన్ తన డిస్‌ప్లే కాంతిని వాతవరణాన్ని బట్టి తనకి తానుగా సర్దుబాటు చేసుకుంటుంది.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన మోషన్ కాన్సియన్ ఆడియో వ్యవస్థ ఎటువంటి పర్యావరణంలోనైనా క్లియర్ వాయస్‌ను అందిస్తుంది.

డొకొమో స్పెషల్ డేటా ప్లాన్స్:

ఈ ఫోన్ కొనుగోలు పై డొకొమో ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డేటా ప్యాకేజీలను అందిస్తోంది. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన అన్ లిమిటెడ్ 899 జీఎస్ఎమ్ పోస్ట్‌‌పే ప్లాన్ ద్వారా యూజర్ 3జీ సామర్ధ్యం గల 1జీబి డాటాను మూడు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, ఏ ఇతర నెట్‌వర్క్‌ల‌కైనా లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా నిర్వహించుకోవచ్చు.

యాపిల్ ఎఫెక్ట్: సామ్‌సంగ్ టాబ్లెట్ పై 6,000 తగ్గింపు!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X