మొబైల్ మరియు హ్యాండ్ సెట్ల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా బ్రాండ్ ‘జీ ఫైవ్’ టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టునుంది. 7, 10 అంగుళాల వేరియంట్లలో రెండు అత్యాధునిక టాబ్లెట్ పీసీలను ఏ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు ‘జీఫైవ్’ కసరత్తులు చేస్తుంది.
విండోస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులను మెప్పించే క్రమంలో జీఫైవ్ ‘విండోస్ 8’, ‘ఆండ్రాయిడ్’ ఆపరేటింగ్ వ్యవస్థలను ఈ టాబ్లెట్లలో ప్రవేశపెట్టింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పని చేస్తాయి.
టాబ్లెట్లలో పొందుపరిచిన 3జీ మరియు వై-ఫై కనెక్టువిటీ అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. 20 సినిమాలతో పాటు 1000 గ్యేమ్ల సామర్ధ్యం కలిగిన 4GB SD cardను అదనపు ఫీచర్గా పొందపరచవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.