అదే జరిగితే అంచనాలు తారుమారు?

ప్రపంచ వ్యాప్తంగా వాడి వేడి ఉత్కంఠ రేపుతున్న గుగూల్ నెక్సస్ టాబ్టెట్ పై తాజా పుకారు షికారు చేస్తోంది. అసస్చే రూపొందించబడిన ఈ డివైజ్ జూన్లో విడుదలకు ముస్తాబవుతున్న నేపధ్యంలో ఈ వివరాలు బయటకు రావటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ హార్డ్వేర్ స్పెషిఫికేషన్లను జూన్ 27న గుగూల్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వెల్లడించనున్నారు.
గుగూల్ నెక్సస్ టాబ్లెట్కు సంబంధించి తాజాగా వ్యక్తమవుతన్న రూమర్లను పరిశీలిస్తే... ఈ డివైజ్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 5.0 జెల్లీబీన్తో రానుందన్న సమాచారం వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. అదేవిధంగా పొందుపరిచిన క్వాడ్ కోర్ టెగ్రా3 ప్రాసెసర్ సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. రూ.10,000లోపు ధరతో విడుదల కాబోతున్న గుగూల్ నెక్సస్ టాబ్లెట్ అనుకున్నట్టుగానే ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైతే మార్కెట్ డిమాండ్ అనూహ్య రీతిలో పెరిగే అవకాశముంది.
టాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం రోజు రోజుకు విస్తృతమవుతున్న నేపధ్యంలో వీటి కొనుగోళ్ల పై ఆసక్తిని కనబర్చే వారు ప్రధానంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు.


Click it and Unblock the Notifications








