ప్రపంచ డాన్ ‘మాస్టర్ ప్లాన్’..?

టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ను శాసిస్తున్న ఆపిల్ అదేవిధంగా ఆమోజన్లకు చెక్ పెట్టందుకు గుగూల్ పక్కా ప్రణాళికను రిచించనట్లు సమాచారం. వ్యహారచనలో భాగంగా ప్రత్యేకించి టాబ్లెట్ కంప్యూటర్లను వినియోగదారులకు నేరుగా అమ్మేందుకు గాను ఆన్లైన్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అసుటెక్ కంప్యూటర్ ఇంక్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో వంటి ప్రముఖ కంపెనీలు తయారు చేసిన ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్టెట్ పీసీలను మాత్రమే ఈ స్టోర్లలో విక్రయించనున్నట్లు వినికిడి. వినియోగదారుడికే నేరుగా స్మార్ట్ఫోన్ అంటూ గతంలో గుగూల్ చేపట్టిన ఈ తరహా కార్యక్రమం అశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టక పోవటంతో నాలుగ నెలల వ్యవధిలోనే ఆ స్టోర్ను మూసివేయ్యాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications








