ఎప్పుడైనా.. ఎక్కడైనా ‘డోంట్ కేర్’

మొబైల్ కంప్యూటర్స్ అదేవిధంగా స్మార్ట్ఫోన్లను దృఢంగా తీర్చిదిద్దటంలో హ్యాండ్హెల్డ్ గ్రూప్ది అందవేసిన చేయి. ఈ కంపెనీ తాజాగా ఫీల్డ్ ప్రొఫెషనల్స్ కోసం ‘ఆల్గిజ్ 10ఎక్స్’(Algiz 10X) పేరుతో పటిష్టమైన టాబ్లెట్ కంప్యూటర్ను ప్రకటించింది. మిలటరీ స్టాండర్డ్ రేటింగ్ (MIL-STD-810G)ను దక్కించుకున్న ఈ డివైజ్ దుమ్ము, నీరు, వైబ్రేషన్స్, కఠిన ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొగలదు. బరువు 1.3 కిలోగ్రాములు, మందం 32మిల్లీమీటర్లు, స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు (ప్రత్యేకమైన టచ్ స్ర్కీన్ వ్యవస్థ). యూ-బ్లాక్స్ జీపీఎస్ రిసీవర్ వ్యవస్థను డివైజ్లో నిక్షిప్తం చేశారు. ప్లస్ బ్లూటూత్ 4.0 బి/జి/ఎన్, డబ్ల్యూడబ్ల్యూఏఎన్ గోబి 3000 వంటి ప్రత్యేక ఫీచర్లు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి.
ఇతర ఫీచర్లను పరిశీలిస్తే..:
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వాటర్ప్రూఫ్ యూఎస్బీ 2.0, వీజీఏ ఇంకా ఆర్ఎస్232 పోర్ట్స్,
శక్తివంతమైన ఇంటెల్ ఆటమ్ ఎన్2800 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
ఎస్ఎస్డి డిస్క్,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ఫీచర్,
విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం (త్వరలో విండోస్ 8కు అప్ గ్రేడబుల్).
వచ్చే ఏడాది జనవరి నాటికి ఆల్గిజ్ 10ఎక్స్ అందుబాటులోకి రానుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications