చైనా తరువాతే భారత్లోకి అడుగుపెడుతుంది!

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ హువావీ(Huawei), మీడియా ప్యాడ్ 10ఎఫ్హెచ్డి పేరుతో హై ఎండ్ టాబ్లెట్ కంప్యూటర్లను త్వరలో విడుదల చెయ్యనుంది. ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ప్లాట్ఫామ్ పై రన్ అయ్యే ఈ డివైజ్లో శక్తివంతమైన కె3 క్వాడ్కోర్ ప్రాసెసర్ను వినియోగించారు. ఏర్పాటు 10 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ ఉత్తమ క్వాలిటీ విజువల్ అనుభూతికిలోను చేస్తుంది. పీసీ డిజైనింగ్లో భాగంగా ఆల్యూమినియమ్ ఛాసిస్ను ఉపయోగించారు. బరువు కేవలం 598 గ్రాములు.
టాబ్లెట్ ఫీచర్లు క్లుప్తంగా:
10 అంగుళాల 10-పాయింట్ మల్టీ టచ్స్ర్కీన్ (రిసల్యూషన్1920× 1200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ చిప్సెట్,
1.5గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన కె3 వీ2 ప్రాసెసర్,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
మైక్రోఎస్డి స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
వై-ఫై,
బ్లూటూత్ 2.1,
6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
టాబ్లెట్ను తొలిగా చైనా మార్కెట్లో విడుదల చేస్తారు. భారత విపణిలో ఈ డివైజ్ను ఆగష్టులో విడుదల చేసే అవకాశముంది. ధర అంచనా రూ.25,000.


Click it and Unblock the Notifications








