ప్రీ-ఆర్డర్ చేస్తే ‘ఫ్రీ’ గిఫ్ట్!

ప్రముఖ టాబ్లెట్ పీసీల తయారీ సంస్థ హువావీ (Huawei)తన తక్కువ ధర టాబ్లెట్ ‘మీడియా ప్యాడ్ 7 లైట్’ ఇండియాలో విడుదలకు సంబంధించి కీలక ప్రకటనను వెలువరించింది. దేశీయ విపణిలో ఈ వారం నుంచి లభ్యంకానున్న ఈ పీసీ ముందస్తు బుకింగ్లను ఫ్లిపికార్ల్ డాట్ కామ్ ద్వారా నిర్వహించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ధర రూ.13,700. ఈ టాబ్లెట్ కొనుగోలు పై సామ్సంగ్ హెచ్ఎమ్-1100 బ్లూటూత్ హెడ్సెట్ను ఉచితంగా పొందవచ్చు. లింక్ అడ్రస్:
మీడియా ప్యాడ్ 7 లైట్ ఫీచర్లు:
3జీ టాబ్లెట్,
7 అంగుళాల స్ర్కీన్ డిస్ ప్లే(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
శక్తివంతమైన 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
600మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్ద్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ (వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్),
శక్తివంతమైన 4,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








