షాకింగ్ న్యూస్.. (అన్న కొత్త అవతారం)?

అవును మీరు వింటున్నది నిజం.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండై (Hyundai) టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ డిజైన్ చేసిన మూడు ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ టాబ్లెట్ కంప్యూటర్లు రష్యన్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్నాయి. హెచ్టి- 7బి, హెచ్టి - 9బి, హెచ్టి- 10బి పేర్లతో మూడు భిన్నమైన స్ర్కీన్ వేరియంట్లలో విడుదల కాబోతున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు కట్టింగ్ ఎడ్జ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. రష్యన్ మార్కట్లో ఈ ఏడాది 2లక్షల యూనిట్లను విక్రయించేందుకు హ్యుండై కసరత్తులు చేస్తుంది.
హ్యుండై హెచ్టి-7బి:
7 అంగుళాల టచ్స్ర్కీన్ రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2మెగా పిక్సల్ కెమెరా,
0.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీ ఇంటర్నల్ మెమరీ, 1గిగాహెట్జ్ సామ్సంగ్ ప్రాసెసర్,
3జీ రేడియో, నావీటెల్ నావిగేషన్ సాఫ్ట్వేర్,
రెండు వర్షన్లలో లభ్యం కానున్న ఈ టాబ్లెట్ ధరలు రూ.12273, రూ.14,115గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








