పీహెచ్డీ ప్రోగ్రామ్లకు ఇంటెల్ ఫెల్లోషిప్
కంప్యూటర్ చిప్ల తయారీ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంటెల్, భారత్లోని పీహెచ్డీ ప్రోగ్రామ్లను ప్రోత్సహిస్తూ ఫెల్లోషిప్ను ప్రకటించింది. వచ్చే జూలై నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి తాము ప్రవేశపెట్టబోయే ఫెల్లోషిప్ అందుబాటులోకి వస్తుందని ఇంటెల్ ఇండియా శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల వరకు రూ.5.70లక్షల ఫెల్లోషిప్ను అందిస్తామని కంపెనీ వెల్లడించింది.

2014లో 5,000 ఉద్యోగాలకు కోత
తమ కంప్యూటర్ చిప్ల వ్యాపారం క్షీణిస్తున్న నేపధ్యంలో ఖర్చులను తగ్గించేందకు ఈ 2014లో 5,000 ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ఇంటెల్ కార్పొరేషన్ ఇటీవల. కాలిఫోర్నియాలోని సాంటా క్లారా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటెల్ కార్పొరేషన్ ఈ వార్తను ధృవీకరించింది. 5,000 మంది ఉద్యోగులను తొలగించటం వల్ల కంపెనీకి ఎంత మొత్తం ఆదా అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ల విక్రయాలు రోజురోజుకు తగ్గిపోతున్న నేపధ్యంలో ఇంటెల్ చిప్లకు డిమాండ్ తగ్గుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications