కేరళ ఇంజనీర్ కొత్త ఎత్తుగడ.. సినీ పైరసీలకు చెక్!
సినీ పరిశ్రమను కదిపేస్తున్న పైరసీని నిరోధించేందుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసాడు. వివరాల్లో వెళితే... కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్గీస్ బాబు సరికొత్త యాంటీ పైరసీ డివైజ్ను రూపొందించాడు.

‘డిమాలిష్ డూప్లికా'పేరుతో పిలవబడుతున్న ఈ హార్డ్వేర్ వ్యవస్థను సినిమా హాళ్లలో అమర్చినట్లయితే సినిమా ప్రసారమవుతున్న సమయంలో ఎవరైన సరే మొబైల్ ఫోన్ లేదా వెబ్ క్యామ్ ద్వారా సినిమాను రికార్డ్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే సదరు హార్డ్వేర్, రికార్డింగ్ను నివారించటంతో పాటు ఓ అలర్ట్ సందేశాన్ని యాంటీ-పైరసీ సెల్కు చేరవేస్తుందని బాబు ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
ఈ డివైజ్ ఖరీదు రూ.1.5మిలియన్ ఉంటుందట. ఈ డివైజ్ ట్రాక్ టాంపరింగ్, సీరియల్ నెంబర్ రికార్డింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉందని బాబు వివరించారు.


Click it and Unblock the Notifications








