ఫిబ్రవరి 2012.. రూ.6000కే..?

ప్రస్తుత కంప్యూటింగ్ మార్కెట్లో ఆండ్రాయిడ్ టాబ్లెట్ పీసీల హవా కొనసాగుతోంది. ఇందుకు కారణం మన్నికైన ఫీచర్లను ఆయా డివైజుల్లో నిక్షిప్తం చేయ్యటమే. అనతి కాలంలో వినియోగదారుల విశ్వసనీయతను చొరగున్న గుగూల్ రివల్యూషనరీ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్’ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ కు దోహదపడుతుంది.
ఫిబ్రవరి 2012.. మరో సాంకేతిక విప్లవానికి వేదికగా నిలవనుంది. ప్రముఖ మొబైల్ ఫోన్ ల ఉత్పత్తిదారు లావా ( Lava) ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా రన్ అయ్యే టాబ్లెట్ కంప్యూటర్ ను మార్కెట్లో విడుదల చేయుబోతుంది.
స్లిమ్ స్లాట్ సౌలభ్యతతో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్, రెండు అవసరాలను ఏక కాలంలో తీరుస్తుంది. ఈ డివైజ్ ను మల్టీ పర్సస్ అంటే కంప్యూటింగ్ అవసరాలకు అదేవిధంగా సెల్ ఫోన్ లా ఉపయోగించుకోవచ్చు. టాబ్లెట్ డిస్ ప్లే 7 అంగుళాలు (టచ్ స్ర్కీన్ టైప్) కాగా, ప్రాసెసర్ సామర్ధ్యం 1 GHz.
‘లావా’ ముందస్తు వ్యూహం ప్రకారం టాబ్లెట్ ఈ డిసెంబర్ లోని విడుదల కావల్సి ఉంది. పలు పరిశోధనలు నేపధ్యంలో వీటి విడుదల ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇంతకి ఇండియన్ మార్కెట్లో ‘లావా’ లాంఛ్ చేస్తున్న ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ టాబ్లెట్ ధర ఎంతో తెలుసా రూ.6,000.


Click it and Unblock the Notifications








