మార్కెట్లోకి లెనోవో ఏ7-50 ట్యాబ్లెట్ @రూ.15,499
చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో గడిచిన ఏప్రిల్లో నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిలో ఒకటైన 'లెనోవో ఏ7-50' మోడల్ను ఇండియాలో లెనోవో అధికారిక ఆన్లైన్ స్టోర్ రూ.15,499కి విక్రయిస్తోంది. ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్1280× 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్కోర్ మీడియాటెక్ ఎంటీ8382 చిప్సెట్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ అపరేటింగ్ సిస్టంకు అప్గ్రేడ్ చేసుకునే సౌలభ్యత),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 4.0, 3జీ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ క్వాలిటీతో కూడిన స్టీరియో స్పీకర్ వ్యవస్థ,
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications