కొత్త రిలీజ్లు (స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్స్)!
ఎడ్జ్ ఈ501జీ (Edge E501G):

ప్రముఖ టెక్ కంపెనీ ‘ఎడ్జ్ ఇన్ఫోటెల్’ సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్తో ముందుకొచ్చింది. ఎడ్జ్ ఈ501జీ మోడల్లో రూపుదిద్దుకున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్ 3డీ వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది. ధర రూ.5,499. ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు క్లుప్తంగా……
డిస్ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్స్ర్కీన్ డిస్ప్లే, హైక్వాలిటీ 3డీ గ్రాఫిక్ సపోర్ట్,
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువటీ: వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ వయా డాంగిల్,
బ్యాటరీ: 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
అదనపు ఫీచర్లు: 3డీ గ్రాఫిక్స్ సపోర్ట్, ప్రీలోడెడ్ అప్లికేషన్లు: భగవత్ గీతా, రామాయణా, హనుమాన్ చాలీసా, హిందూ క్యాలెండర్, బ్రిటీష్ రెడ్క్రాస్, హెచ్డిఎఫ్సీ & ఐసీఐసీఐ బ్యాంక్ అప్లికేషన్స్, 3డీ వీడియో గేమ్స్, హైడెఫినిషన్ క్వాలిటీతో 3డీ సినిమాలు.
ధర: రూ.5,499 (కొనుగోలు పై రూ.499 విలువ చేసే స్లీక్ జిప్ పౌచ్ ఉచితం),
ట్యాబ్లెట్ కలర్ వేరియంట్స్: బ్లాక్ ఇంకా వైట్.


Click it and Unblock the Notifications








