ఈ వారం విడుదలైన టాబ్లెట్స్.. స్మార్ట్ఫోన్స్!
నోకియా ఆషా 308, లూమియా 510(Nokia Asha 308, Lumia 510):

ఆషా 308: భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న డ్యూయల్ సిమ్ టచ్స్ర్కీన్ స్మార్ట్ఫోన్ ‘నోకియా ఆషా 308’ భారతీయ మార్కెట్లో లభ్యమవుతోంది. నోకియా షాప్ ద్వారా ‘నోకియా ఆషా 308 (గోల్డ్) వేరియంట్’ను రూ.5685కు సొంతం చేసుకోవచ్చు.
ఫోన్ స్పెసిఫికేషన్లు:
బరువు 101.6 గ్రాములు, చుట్టుకొలత 109.9 X 54 X 13 మిల్లీమీటర్లు, 3 అంగుళాల కెపాసిటివ్ డిస్ప్లే, సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 2మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబిక పొడిగించుకునే సౌలభ్యత, ఇన్బుల్ట్ ఫేస్బుక్, ట్విట్టర్ అప్లికేషన్స్, 20ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 64ఎంబీ ర్యామ్, 128ఎంబి రోమ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్ ఫీచర్.
లూమియా 510: నోకియా ఇండియా తన ఎంట్రీ స్థాయి విండోస్ స్మార్ట్ ఫోన్ ‘లూమియా 510’ను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ధర అంచనా రూ.11,000.
ఫీచర్లు:
4 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ కెమెరా,
800మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
256ఎంబీ ర్యామ్,
7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఇన్ బుల్ట్ అప్లికేషన్స్ (నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్ పోర్ట్, నోకియా డ్రైవ్ నావిగేషన్).
ఈ ఫోన్ కొనుగోలు పై యూజర్ మూడు నెలల పాటు నోకియా మ్యూజిక్ అలాగే నోకియా మిక్స్ రేడియో సేవలను ఉచితంగా పొందవచ్చు. విండోస్ 7.8 అప్ డేట్ ను ఈ లూమియా 510 పొందనుంది.


Click it and Unblock the Notifications








