టైం దగ్గర పడింది... డబ్బులు రెడీ చేసుకోండి!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆధారితంగా పని చేసే ఈ పీసీలో శామ్సంగ్ చిప్సెట్లను దోహదం చేయునున్నారు. ఈ అంశానికి సంబంధించి మెర్క్యురీ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ స్పందిస్తూ మార్చి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్లలో ఈ డివైజ్ లభ్యమవుతుందని స్పష్టం చేశారు. 7 అంగుళాల టచ్ స్ర్కీన్, శామ్సంగ్ చిప్సెట్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్, 3జీ కనెక్టువిటీ, టాబ్లెట్ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్, డిడిఆర్3 మెమరీ.


Click it and Unblock the Notifications








