మార్చిలో మెర్క్యురీ టాబ్లెట్..!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త స్మార్ట్ టాబ్లెట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ కంప్యూటింగ్ డివైజ్ అత్యుత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. మార్చి చివరి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్లలో ఈ టాబ్లెట్ పీసీ లభ్యం కానుంది.
ఫీచర్లు:
* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్,
* 3జీ కనెక్టువిటీ,
* టాబ్లెట్ ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్,
* డిడిఆర్3 మెమరీ.


Click it and Unblock the Notifications








