చిన్నారుల కోసం ‘ఎడ్డీ’ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్
ప్రముఖ ఎడ్యుకేషన్ స్టార్టప్ మెటిస్ లెర్నింగ్ బుధవారం రెండేళ్ల నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారుల కోసం ‘ఎడ్డీ'(Eddy) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను విడుదల చేసింది. విద్యా సంబంధిత పాఠ్యాంశాలతో పాటు వివిధ రకాల ఆటలను నేర్చుకునేందుకు వీలుగా ఈ ట్యాబ్లెట్ కంప్యూటర్ను రూపొందించారు. ట్యాబ్లెట్ ధర రూ.9,999. ప్రత్యేకించి చిన్నారుల కోసం రూపొందించబడిన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ప్రస్తుతం ఎడ్డీట్యాబ్లెట్.కామ్, అమెజాన్.ఇన్ వంటి రిటైలింగ్ వెబ్సైట్లలో మాత్రమే లభ్యమవుతోంది. ట్యాబ్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

7 అంగుళాల కెపాసిటివ్ (5 పాయింట్ టచ్స్ర్కీన్ )ఎల్సీడీ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ ఆర్మ్కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్),
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
యూఎస్బీ, వై-ఫై కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

150 హైక్వాలటీ గేమ్లను ట్యాబ్లెట్లో ముందుగానే నిక్షిప్తం చేసారు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా 50,000 విద్యాసంబంధిత అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే వెసలబాటు. ట్యాబ్లెట్ ఆవిష్కరణ సందర్భంగా మెటిస్ లెర్నింగ్ సీఈఓ భారత్ గులియో మాట్లాడుతూ 21వ శతాబ్థపు బాల్యం, టెక్నాలజీ వాతావరణంలో నివశిస్తున్న నేపధ్యంలో తాము రూపొందించిన ఎడ్డీ ట్యాబ్లెట్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని అన్నారు. పాఠ్యాంశాల దగ్గర నుంచి ఆటల వరకు పొందుపరిచిన ఏకైక ట్యాబ్లెట్ ఎడ్డీయే అన్ని అన్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








