మోటరోలా ఫస్ట్!

మోటరోలా రూపొందించిచ మోస్ట్ పాపులర్ టాబ్లెట్ పీసీ ‘మోటరోలా జూమ్ వై-ఫై వర్షన్’ త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్డేట్ను పులుముకోనుంది. దీంతో 10 అంగుళాల టాబ్లెట్ పీసీ విభాగంలో జెల్లీబీన్ అప్డేట్ పొందిన తొలి టాబ్లెట్గా మోటరోలా జూమ్ గుర్తింపు పొందనుంది. ఈ తాజా నవీకరణతో టాబ్లెట్ పనితీరు మరింత మెరుగుపడనుంది.
జెల్లీబీన్ అప్డేట్ ద్వారా పొందే లాభాలు:
మెరుగైన యూజర్ ఇంటర్ఫేస్,
వేగవంతమైన స్పందన,
విస్తరించదగిన నోటిఫికేషన్లు,
మెరుగైన విడ్జెట్లు,
మెరుగైన టెక్స్ట్,
మెరుగైన స్పీకింగ్ సామర్ద్యం,
గెస్ట్యుర్ మోడ్,
వాయిస్ సెర్చ్.
మోటరోలా జూమ్ ఫీచర్లు:
10.1 అంగుళాల టచ్స్ర్కీన్, రిసల్యూషన్ ( 800 x 1280పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.6 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 3జీ, ధర రూ. 27,500.


Click it and Unblock the Notifications








