సస్పెన్స్కు తెరపడింది..?

అభిమానుల నిరీక్షణ ఫలిచింది.. వాయిదాపడుతూ వస్తున్న ఓ బృహత్తర నవీకరణ ఆచరణకు నోచుకుంది.. వివరాల్లోకి వెళితే, ప్రముఖ బ్రాండ్ ఏసర్ రూపొందించిన ‘ఐకోనియా ట్యాబ్ 500’ టాబ్లెట్ కంప్యూటర్కు ఆండ్రాయిడ్ ఐస్క్రీమ్ శాండ్విచ్ అప్డేట్ లభించింది. ప్రస్తుతానికి ఈ తాజా ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ యూఎస్, కెనడాలోని యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. తొలత ఈ అప్డేట్ను ఫిబ్రవరిలో ప్రకటించారు. పలు కారణాల రిత్యా ఈ ఆవిష్కరణ ఏప్రిల్ వరకు వాయిదా పడింది.
ఈ తాజా వోఎస్ అప్డేట్తో చేకూరే లాభాలు:
మెరుగైన యూజర్ ఇంటర్ ఫేస్,
క్వాలిటీ కమ్యూనికేషన్,
యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్,
వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్.
ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ500 ఫీచర్లు:
10.1 అంగుళాల టచ్స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),
1గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
డాల్బీ ఆడియో మొబైల్ టెక్నాలజీ,
వై-ఫై,
బ్లూటూత్,
హెచ్డిఎమ్ఐ పోర్టు,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,
లై-పాలిమర్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








